
Indian Geography Important Points in Telugu – భారతదేశ భౌగోళిక స్వరూపం – ముఖ్యాంశాలు
We have compiled important points of Indian Geography in Telugu for candidates preparing for UPSC Civil Services, TSPSC and APPSC Group -1, Group -2 and Group -3 exams in Telugu Medium.
ఉనికి, పరిమాణం
- భారతదేశం భౌగోళికంగా ఉత్తరార్ధ గోళంలో 8o 4′ – 37o 6′ ఉత్తర అక్షాంశాలు, పూర్వార్ధ గోళం లో 68o 7′ – 97o 25′ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
- భారతదేశ వైశాల్యం: 32,87,263 చ.కి.మీ
- దేశంలో భూభాగం 90.08 శాతం కలదు.
- నీటిచే ఆక్రమించిన భాగం 9.92 శాతం.
- ప్రపంచ విస్తీర్ణంలో 7వ పెద్ద దేశం (రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారతదేశం)
- ఆసియాలో చైనా తర్వాత రెండోపెద్ద దేశం, దక్షిణాసియాలో పెద్ద దేశంగా ఉన్నది.
- ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణం 2.4 శాతం.
- వైశాల్యంలో పెద్ద రాష్ట్రం : రాజస్థాన్ (8, 249 చ.కి.మీ)
- వైశాల్యంలో చిన్న కేంద్ర పాలిత ప్రాంతం : లక్షదీవులు (32చ.కి.మీ)
- శీతోష్ణస్థితి : భారతదేశం మధ్య గుండా 231/2 ఉత్తర అక్షాంశరేఖ (కర్కాటక రేఖ) పోతుంది.
- కర్కాటకరేఖకు ఎగువ భాగం ఉప ఆయనరేఖ శీతోష్ణస్థితి కలదు. కర్కాటక రేఖ దిగువ భాగం ఆయనరేఖ శీతోష్ణస్థితి కలదు .
- భారత్ మధ్య నుంచి 231/2 ఉత్తర అక్షాంశరేఖ (కర్కాటకరేఖ 8 రాష్ట్రాల మీదుగా పోతుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమబంగా, త్రిపుర, మిజోరాం)
- కర్కాటకరేఖ అత్యధిక దూరం పోయే రాష్ట్రం – మధ్యప్రదేశ్, అత్యల్ప దూరం – రాజస్థాన్
- భారతదేశం తూర్పు, పడమరలు 2,933 కి.మీ వెడల్పున, ఉత్తర దక్షిణాలుగా 3,214 కి.మీ విస్తరించి ఉంది.
- ఉత్తర- దక్షిణ, తూర్పు-పడమరల మధ్య 281 కి.మీ వ్యత్యాసం కలదు.
- అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల – మే
- అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే నెల – జనవరి
వర్షపాతం
- సగటు వర్షపాతం – 1083 సెంటీమీటర్లు (2014)
- అత్యధిక వర్షపాతం – 1141సెంటీ మీటర్లు (మాసిన్రామ్, మేఘాలయ)
- అత్యల్ప వర్షపాతం – 10 సెంటీమీటర్లు ( జైసల్మీర్, రాజస్థాన్)
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
- 1947, ఆగస్టు 15న – 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.
- ప్రస్తుతం – 29 రాష్ర్టాలు,7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి
- చివరగా ఏర్పడిన రాష్ట్రం – తెలంగాణ ( జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా ఏర్పడింది)
- దేశంలో మొత్తం జిల్లాలు – 704 (తెలంగాణాలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలతో కలిపి)
- అత్యధిక జిల్లాలు ఉన్న రాష్ట్రం – ఉత్తరప్రదేశ్ (75)
- అత్యల్ప జిల్లాలు ఉన్న రాష్ట్రం – గోవా (2)
- అత్యధిక జిల్లాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం – నేషనల్ క్యాపిటల్ టెరిటరి ఆఫ్ ఢిల్లీ (11)
- అత్యల్ప జిల్లాలు ఉన్న కేంద్రపాలిత ప్రాంతం – దాద్రా నగర్ & హవేలీ, చండీగఢ్, లక్షద్వీప్ (1)
- అతిపెద్ద జిల్లా – కచ్ (గుజరాత్)
- అతిచిన్న జిల్లా – మహే (పుదుచ్చేరి)
సరిహద్దు – దేశాలు
- భారతదేశ అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు -15,200 కి.మీ
- భారతదేశంలోని 17 రాష్ర్టాలతో 7 దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. (బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్)
- భారత్తో పొడవైన భూ సరిహద్దు ఉన్న దేశం – బంగ్లాదేశ్ (4,096 కి.మీ)
- భారత్తో అతి తక్కువ భూ సరిహద్దు ఉన్న దేశం – ఆఫ్ఘనిస్తాన్ (80 కి.మీ)
- భారతదేశ ప్రాదేశిక సరిహద్దు పొడువు-12 నాటికల్ మైళ్లు
- భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలం పొడవు -300 మైళ్లు
- ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి అత్యధికంగా 8 రాష్ర్టాలతో సరిహద్దు ఉంది.(ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్)
- పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – రాజస్థాన్
- ఆఫ్ఘనిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – జమ్ము & కశ్మీర్
- చైనాతో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం- జమ్ము & కశ్మీర్
- నేపాల్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – బీహార్
- భూటాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – అసోం
- మయన్మార్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – అరుణాచల్ప్రదేశ్
- బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం – పశ్చిమబంగా
భారత్ ప్రామాణిక కాలం
- భారతదేశ ప్రామాణిక కాలం (IST), గ్రీనిచ్ కాలానికంటే ముందు + 5:30 గంటలు ముందు ఉంటుంది.
- రేఖాంశాల పరంగా తూర్పు- పడమరలుగా 30 డిగ్రీలు మాత్రమే విస్తరించి ఉంది. అందువలన పశ్చిమాన గుజరాత్లోని ద్వారకా కంటే తూర్పు అంచున ఉన్న అరుణాచల్ప్రదేశ్లో 2 గంటల ముందు సూర్యోదయం అవుతుంది.
- సూర్యుడు ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాల సమయం పడుతుంది.
- భారతదేశ ప్రామాణిక కాలం 821/2 తూర్పు రేఖాంశం. ఇది 5 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మీదుగా వెళ్తుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలోని యానాం జిల్లా నుంచి పోతుంది.
- భారతదేశ ప్రామాణిక కాలం 821/2 తూర్పు రేఖాంశం.
- ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పట్టణం మీదుగా, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వెళ్తుంది.
సరిహద్దు రేఖలు, జలసంధులు
- మెక్మోహన్రేఖ – భారత్- చైనా
- రాడ్క్లిఫ్ రేఖ – భారత్- పాకిస్తాన్
- డ్యూరాండ్ రేఖ – భారత్- ఆఫ్ఘనిస్తాన్
- పాక్ జలసంధి – భారత్ -శ్రీలంక
- వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) – భారత్, చైనాల మధ్య ఉత్తరభాగం (జమ్ముకశ్మీర్లో) కలదు.
- భారత్, శ్రీలంక మధ్య – మన్నార్ సింధూశాఖ, పాంబన్ దీవులు, ఆడమ్స్బ్రిడ్జి ఉంది.
భారత సరిహద్దు ప్రాంతాలు
- ఉత్తరం – కిలిక్ ధావన్పాస్ (ఇందిరా కాల్), జమ్ము కశ్మీర్
- దక్షిణం – ఇందిరాపాయింట్ (గ్రేట్ నికోబార్)/ పిగ్మేలియన్ పాయింట్
- తూర్పు – పూర్వాంచల్ పర్వతాలు (అరుణాచల్ప్రదేశ్)
- పడమర – రాణా ఆఫ్ కచ్ (సర్ క్రిక్), గుజరాత్
భూ పరివేష్టిత రాష్ర్టాలు
- 5 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత పాంత్రాలకు అంతర్జాతీయ సరిహద్దుగాని, తీరరేఖ గాని లేవు. కావున ఈ రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ర్టాలు అంటారు.
- ఇవి : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ రాష్ర్టాలతో పాటు చండీగఢ్, ఢిల్లీ, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
పర్వతాలు
- నవీన పర్వతాలు (ప్రపంచంలో) – హిమాలయాలు
- పురాతన పర్వతాలు (ప్రపంచంలో) -ఆరావళి పర్వతాలు
- దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విడదీసే పర్వతాలు – వింధ్య, సాత్పూర పర్వతాలు
- దేశంలో ఎత్తైన శిఖరం – కాంచనజంగ (8,598 మీ), ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య కలదు.
- ప్రపంచంలో ఎత్తైన శిఖరం – ఎవరెస్ట్ (8,848మీ), నేపాల్లో ఉంది.
- ప్రపంచంలో ఎత్తైన రెండో శిఖరం – K2. దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అంటారు. ఇది కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. ప్రస్తుతం ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉంది. పాకిస్తాన్లో దీనిని చోఘోరీగా పిలుస్తారు. కానీ మనదేశంలో K2 శిఖరాన్ని మన అంతర్ భూభాగంగా పరిగణిస్తాం.
- పల్లపు ప్రాంతం – కుట్టనడ
- అత్యధిక ఉష్ణోగ్రత – రాజస్థాన్ (బార్మర్లో 500 సెల్సియస్, సెప్టెంబర్ 13, 1922లో నమోదైంది).
- అత్యల్ప ఉష్ణోగ్రత – జమ్ము కశ్మీర్లోని ద్రాస్ సెక్టార్లో – 49 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
సరస్సులు
- సాంబార్ – అతిపెద్దది
- ఊలార్- అతిపెద్ద మంచినీటి సరస్సు
- చిలకా – అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
సముద్ర తీరరేఖ
- అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం -గుజరాత్ (1054కి.మీ)
- అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం – గోవా ( 36కి.మీ)
- మూడు సముద్రాల కలయికతో కూడిన తీరరేఖ కలిగిన రాష్ట్రం – తమిళనాడు
- దేశంలో ఎక్కువ తీరరేఖ గల నగరం – చెన్నై
- దేశంలో పొడవైన బీచ్ -చెన్నై మెరీనా బీచ్ (13 కి.మీ)
- తీరరేఖ, అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ర్టాలు – గుజరాత్, పశ్చిమబంగా
- వ్యాపారపరంగా భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి – 200 నాటికల్ మైళ్లు (సుమారు 320 కి.మీ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో దొరికే వనరులన్నీ దేశానికే చెందుతాయి).
దీవులు
- దేశంలో మొత్తం దీవులు – 247 (బంగాళాఖాతంలో 203, మిగిలినవి అరేబియా సముద్రం, మన్నార్ సింధూశాఖల్లో ఉన్నాయి).
- బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో పెద్ద దీవి- గ్రేట్నికోబార్
- అండమాన్ దీవుల సముదాయంలో కేవలం 36 దీవుల్లో మాత్రమే జనజీవనం కలదు.
- భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న దీవి – గ్రేట్ నికోబార్
- అరేబియా సముద్రంలో లక్షదీవులు కలవు. ఇందులో 36 దీవులు ఉన్నప్పటికీ, 10 దీవుల్లో మాత్రమే జనజీవనం ఉంది. వీటి వైశాల్యం 32 చ.కి.మీ.
- లక్షదీవుల్లో పెద్దదీవి -మినికాయ్ దీవి
- ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి- మజూరీ దీవి (అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో కలదు)
nice information but add some more information about indian geography
దేశంలో ఎత్తైన శిఖరం – కాంచనజంగ (8,598 మీ), ఇది సిక్కిం, తూర్పు నేపాల్ మధ్య కలదు — this is wrong
K2 – is the highest mountain in india.
Nice information and add some more information about indian geography
Nice information thanks